జగన్ వస్తే రౌడీ రాజ్యమే..!

Update: 2019-04-04 05:23 GMT

వైఎస్ జగన్ వస్తే రౌడీ రాజ్యం వస్తుందని వ్యాఖ్యానించారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఘటనపై స్పందించిన ఆయన వైఎస్ జగన్ ఎన్నికల పర్యటనలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తన సభకు రాలేదన్న అక్కసుతో జగన్ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వెళ్లారని మంత్రి విమర్శించారు. మైలవరం చరిత్రలోనే ఎన్నడూ లేని అరాచకాన్ని జగన్ సృష్టించారని వ్యాఖ్యానించారు. పోలీసులు, అధికారులు సూచించిన మార్గంలో కాకుండా మరో రూట్ లో జగన్ వచ్చారని ఉమ ఆరోపించారు. పులివెందులకు నీళ్లు ఇచ్చామన్న అక్కసుతో మైలవరానికి వచ్చి రెచ్చగొట్టి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Similar News