ఒకే సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చారన్న జగన్ ఆరోపణలకు మంత్రి దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. ప్రమోషన్లు పొందిన 40 మంది డీఎస్పీల వివరాలు బయటపెట్టాలని జగన్కు సవాల్ విసిరారు. ఎవరు ఎప్పుడు ప్రమోషన్ ఇచ్చారో మొత్తం మీడియా ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. దుర్మర్గంగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.