ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం

మహబూబాబాద్ జిల్లాలో జిల్లా పరిశ్రమల అధికారి లంచం తీసుసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Update: 2019-01-10 11:24 GMT

మహబూబాబాద్ జిల్లాలో జిల్లా పరిశ్రమల అధికారి లంచం తీసుసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వంగర మండలానికి చెందిన దారవత్ భగ్న సబ్సిడీ స్కీం ద్వారా హార్వెస్టర్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. ప్రభుత్వం నుండి అతనికి రావాల్సిన 35శాతం సబ్సిడీ మంజూరు చేయకుండా పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ వీరేశం ఇవ్వకుండా సతాయిస్తున్నాడు. డబ్బులు ముట్టచెబితేనే మంజూరు చేస్తానని 12వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఎసీబీని ఆశ్రయించాడు. బాధితుడి నుండి అధికారి 10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  

Similar News