వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ

Update: 2019-01-27 09:27 GMT

దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన తన కుమారుడు హితేష్‌ చెంచురాంతో కలిసి లోటస్ పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి తన కుమారుడు హితేష్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్‌తో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. 

Similar News