దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన తన కుమారుడు హితేష్ చెంచురాంతో కలిసి లోటస్ పాండ్లో వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి తన కుమారుడు హితేష్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్తో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు.