పంటపొలాల్లోకి మొసలి

Update: 2019-05-02 12:34 GMT

భూగర్భ జలాలు అడుగంటడంతో వన్య ప్రాణులు వేసవి తాపాన్ని తట్టుకోలేక పంట పొలాల్లోకి వస్తున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలం పెద్దమ్మగడ్డ పొలాల వద్దకు వచ్చిన మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వన్య ప్రాణులు బయటికి రావడంతో వ్యసాయ పనులకు వెళ్లాలంటే జనాలు జంకుతున్నారు. ఇలాంటి ఘటనలపై ఫారెస్ట్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News