ఏపీలో జనసేన, బీఎస్పీ, సీపీఎంలతో పొత్తు ఖరారైన విషయం తెలిసిందే, సీపీఐ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు.మిగిలిన అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను రేపు ప్రకటించనున్నట్టు సీపీఐ నారాయణ తెలిపారు.
అభ్యర్థులు వీరే -
1.పాలకొండ-డాక్టర్ డీవీజీ శంకర రావు
2.ఎస్.కోట-పి కామేశ్వరరావు
3.విశాఖపట్నం వెస్ట్-సత్యనారాయణ మూర్తి
4.మంగళగిరి-ముప్పాళ్ల నాగేశ్వరరావు
5.కనిగిరి-ఎంఎల్ నారాయణ
6.డోన్-కె.రామాంజనేయులు
బీఎస్పీకి మూడు లోక్ సభ సీట్లు, 21 అసెంబ్లీ స్థానాలను జనసేన కేటాయించగా సీపీఐ, సీపీఎంలకు ఆరు శాసనసభ, రెండేసి లోక్సభ స్థానాలు ఇచ్చేలా జనసేన పార్టీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.