ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ ఫైనల్ రేపు ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ముంబై, చెన్నై జట్ల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్కు హైదరాబాద్ పోలీసులు పూర్తి బందోబస్తు చేశారు. వివిధ విభాగాలకు చెందిన సుమారు 2850 మంది పోలీసులతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు బందోబస్తు కల్పిస్తున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సాయంత్రం 4.30 నిమిషాల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలును పొడిగించినట్లు మహేష్ భగవత్ తెలిపారు.