ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్విహంచారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ తెలిపింది. అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేస్తానన్నారు. పార్టీ కోసం పనిచేస్తానని, అధ్యక్షుడిగా కొనసాగలేనని రాహుల్ వెల్లడించినట్లు సమాచారం. అయితే రాహుల్ రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. ఈ ఓటమి బాధ్యత అందరిది అని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రాహుల్ను బుజ్జగించారు. పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను రాహుల్కే అప్పగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది.