పుల్వామా ఉగ్రదాడి ఘటనను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టి ముక్కలు చేయాలని కొన్ని శక్తులు భావిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇలాంటి వారి కలలు ఎప్పటికీ ఫలించవన్నారు. భారతీయ సైన్యం, ప్రభుతానికి తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామన్నారు. వీరమణం పొందిన సైనికులకు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు.