ఆ రెండుపార్టీలు పెద్ద తప్పు చేశాయ్..

ఎస్పీ, బీఎస్పీలు తీసుకున్న అనూహ్యం నిర్ణయంతో షాక్ తిన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒంటరిగా బరిలో నిలవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Update: 2019-01-12 11:43 GMT

ఎస్పీ, బీఎస్పీలు తీసుకున్న అనూహ్యం నిర్ణయంతో షాక్ తిన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒంటరిగా బరిలో నిలవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎస్పీ, బీఎస్పీల పొత్తుతో ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని మాయావతి ప్రకటించారు. గతంలో కాంగ్రెస్‌తో పొత్తు ఏమాత్రం కలిసిరాలేదని మాయావతి తెలిపారు. ఎస్పీ, బీఎస్పీల పొత్తుపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి ఆ రెండు పార్టీలు పెద్ద తప్పు చేశాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీని లెక్కలోకి తీసుకోకుండా పొత్తును ఖరారు చేయడం ఎస్పీ, బీఎస్పీలు చేసిన ప్రమాదకరమైన తప్పిదమని వ్యాఖ్యానించారు.  

Similar News