కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనం ప్రక్రియ వేగంగా దూసుకెళ్తోంది. ఉత్తమ్ రాజీనామాతో ఈ ప్రక్రియ జెట్ స్పీడ్ అందుకుంది. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు జై కొట్టగా తాజాగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ప్రగతీభవన్కు రానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో రోహిత్రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకుంటారు. అయితే ఉత్తమ్ రాజీనామాతో కాంగ్రెస్ సంఖ్యబలం 18 కి పడిపోయింది. ఇందులో ఇదివరకే 11 మంది కారెక్కేందుకు సిద్ధమైనట్లు ప్రకటించగా ప్రస్తుతం పైలెట్ రోహిత్రెడ్డి కూడా గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో కాంగ్రెస్ సంఖ్య ఆరుకు పడిపోనుంది. ఈ ఆరుగురిలో కూడా మరో ఇద్దరు కూడా గులాబీ గూటికి వస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ పరిణామాలతో విలీనం ప్రక్రియ లాంఛనమే అని చెబుతున్నారు. దీంతో తెలంగాణలో కాంగ్రెసు మరో షాక్ తగలనుందనే చెప్పవచ్చు.