టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీఎల్పీ విలీన లేఖ అంశంపై కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీకర్ కార్యాలయానికి ఫోన్ చేశారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరని కార్యాలయ సిబ్బంది తెలిపింది. దీంతో స్పీకర్ తీరుపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమను కలవడానికి స్పీకర్ ఎందుకు సమయం ఇవ్వడం లేదని సీరియస్ అయ్యారు. హైకోర్టులో పిటీషన్ పెండింగ్లో ఉండగా విలీనంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.