కేటీఆర్, కేసీఆర్పై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన జుగుప్సాకరంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులు దేశానికి ప్రమాదమని, ఫిరాయింపులపై 18వ తేదీన గవర్నర్ను కలుస్తామన్నారు భట్టి విక్రమార్క. కొద్ది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపడతామంటున్న భట్టి విక్రమార్క. నలుగురైదుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుంది అనుకోవడం చాలా పొరపాటని, పార్టీ ఇన్ చార్జ్ వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో మార్చి 18న గవర్నర్ ను కలుస్తామని తెలిపారు.