కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో సమావేశం కానున్నారు. ప్రగతి భవన్లో సర్పంచులతో ముఖాముఖికానున్న కేసీఆర్ గ్రామ పరిపాలన, కొత్త పంచాయతీరాజ్ చట్టంతోపాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ పంచాయతీల పనితీరు, గ్రామ స్వరాజ్యం, పనులు-విధులు, హరితహారం, డ్రైనేజీ వ్యవస్థ, దోమల నివారణ, స్ట్రీట్ లైట్స్, మరుగుదొడ్లు, స్మశాన వాటికల ఏర్పాటు, పశువైద్యశాలలు, లైబ్రరీలు, ప్రభుత్వ పాఠశాలలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై కొత్త సర్పంచులతో చర్చించనున్నారు.