దేశంలో ప్రబలమైన, గుణాత్మకమైన మార్పు రావల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మోడీని దించి, రాహుల్ గాంధీని ఎక్కిస్తే పథకాల్లో వ్యక్తుల పేర్లు మాత్రమే మారతాయని విమర్శించారు. గోదావరిఖని ప్రచార సభలో మాట్లాడిన కేసీఆర్ మోదీ హయాంలో దేశానికి ఓరిగిందేమిటి? అని కేసీఆర్ ప్రశ్నించారు. బొగ్గుగని కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ని మాఫీ చేయమని మోదీని అభ్యర్థించినా మాఫీ చేయలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీల పాలన పట్ల ప్రజలు విముఖత చెందారని, వారి సభలకు ప్రజలు హాజరు కావడం లేదని కేసీఆర్ అన్నారు.