డ్వాక్రా మహిళలందరికి పసుపు-కుంకుమ పథకం కింద 10 వేల చొప్పున అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అమరావతి నేలపాడులో జరిగిన పసుపు-కుంకుమ బహిరంగ సభలో డ్వాక్రా మహిళలను కొనియాడారు. వచ్చే రెండు నెలల్లో మూడు విడతల్లో పది వేలను వారి వారి ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. అప్పు తెచ్చైనా సరే ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తన కోరిక అని అన్న చంద్రబాబు గత నాలుగున్నరేళ్లలో పసుపు-కుంకుమ పథకం కింద 21 వేల 116 కోట్లు ఖర్చు చేసినట్లు చంద్రబాబు చెప్పారు.