తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాల నోరు నొక్కే ప్రయత్నం జరుగుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఎలాంటి చర్చా లేకుండా బిల్లుల్ని ఆమోదించడమేంటని ఆయన ప్రశ్నించారు. సభా సాంప్రదాయాలను ప్రభుత్వం పాటించడం లేదన్న భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని తప్పు పట్టారు.