ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత...టీఆర్ఎస్ కార్యకర్తలను తరమికొట్టిన కాంగ్రెస్ శ్రేణులు

Update: 2019-05-10 10:43 GMT

సూర్యాపేట జిల్లా పీక్లా నాయక్ తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడో విడత స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్న సభను టీఆర్ఎస్‌ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తిరగబడిన కాంగ్రెస్ శ్రేణులు వారిని తరిమికొట్టారు. దీంతో ప్రతీకారంగా కాంగ్రెస్ శ్రేణులపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. పరస్పర దాడులతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. 

Similar News