పార్టీ మారాలని చీరాల ఎమ్మెల్యేపై ఒత్తిళ్లు

Update: 2019-02-05 11:22 GMT

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పార్టీ కార్యకర్తలు, నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ మారాలా వద్దా అనే విషయమై అభిప్రాయ సేకరణ చేశారు. వైసీపీలోకి వెళ్ళాలా వద్దా అనే విషయమై తీవ్రంగా చర్చించారు. ఎక్కువ మంది కార్యకర్తలు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరమని ఆమంచికి సూచించారు. టీడీపీలో ఇప్పటికే చాలా అవమానాలు ఎదుర్కొన్నారని పార్టీ కార్యకర్తలు ఆమంచికి గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా వసతులు ఏర్పాటు చేస్తే ఆ విషయాన్ని కూడా కొందరు టీడీపీ నేతలు రాజకీయం చేయడాన్ని కూడా కార్యకర్తలు ఆమంచి దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలల ప్రారంభోత్సవానికి వస్తానని మంత్రి లోకేశ్ వెనుదిరిగిన విషయాన్ని కూడా కార్యకర్తలు, నేతలు ఆమంచికి గుర్తుచేశారు.

Similar News