చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ ను కలిశారు. టీఆర్ఎస్ తీరుపై ఫిర్యాదు చేశారు. తన సంస్థలో పని చేసే వ్యక్తి వద్ద 10 లక్షలు లభిస్తే, టీఆర్ఎస్ నాయకులు 15 కోట్లు లభించాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కంప్లయింట్ ఇచ్చారు. ఎన్నికల ముందు తన పేరును బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తాను గెలుస్తానన్న భయంతోనే అధికార పార్టీ టీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.