పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేషన్ల రోజే టీడీపీ గెలుపు ఖరారు కావాలని ఈ సందర్భంగా చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఉత్సాహపర్చారు. ఈ సంగ్రామం అభివృద్ధికి, అరాచకానికి మధ్య అని వైసీపీకి ఓటేస్తే అరాచకానికి వేసినట్టే అని అన్నారు. వివేకానంద హత్యనే గుండెనొప్పిగా మార్చారని గతం నుంచే వివేకానందరెడ్డితో జగన్కు రాజకీయ వైరం ఉందని చంద్రబాబు అన్నారు. సిట్ విచారణలో నిజాలన్నీ బయటకు వస్తాయని దోషులెవరినీ వదిలేది లేదన్నారు.