వైసీపీలో వేలం పాటే ప్రాతిపదికన ఎంపిక జరుగుతోందని ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికే వైసీపీ టికెట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ఎస్సీ అభ్యర్థులు వైసీపీలో 10కోట్లు, ఓసీ అభ్యర్థులు 20కోట్లు డిపాజిట్ చేయాలట అని అన్నారు. జగన్ పోటీ చేసేది ఒక రాష్ట్రంలో నివాసం ఉండేది ఒక రాష్ట్రంలో అని అన్నారు. ఓటమి భయం జగన్లో కొట్టొచ్చినట్లు కనబడుతుందని చెప్పారు. 40ఏళ్లలో లేనంత పకడ్బందిగా అభ్యర్థుల ఎంపిక జరుపుతున్నట్లు వెల్లడించారు.