ఢిల్లీకి చేరిన చంద్రగిరి...ఏ క్షణంలోనైనా...

Update: 2019-05-17 10:16 GMT

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని మరో రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మరికాసేపట్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పటికే ఈసీ 5 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరో రెండు పోలింగ్ కేంద్రాలకు రీపోలింగ్ ప్రకటిస్తే ఈనెల 19న మొత్తం ఏడు కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం ఈసీ చంద్రబాబు కలవనున్నారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరం తెలపనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనన్న చంద్రబాబు బీజేపీయేతర పార్టీల నేతలో భేటీ అయ్యే అవకాశం ఉంది.

Full View

Similar News