వివేకా కూతురు వ్యాఖ్యల్లో రోజురోజుకూ వైరుధ్యాలు: చంద్రబాబు

Update: 2019-03-28 07:29 GMT

టీడీపీ ప్రచార సభలకు ప్రజల్లో అద్భుత స్పందన వస్తుందన్నారు సీఎం చంద్రబాబు. ఎలక్షన్ మిషన్ 2019పై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టీడీపీ సభలకు వస్తున్న జనసంద్రాన్ని చూసి ప్రత్యర్ధులు బెంబేలెత్తున్నారని చెప్పారు. మూడు పార్టీలు కుమ్మక్కై టీడీపీపై కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అన్నివ్యవస్థలను టీడీపీపై ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. అన్ని పార్టీలను తెలుగుదేశం ఏకం చేస్తుందనే బీజేపీకి కోపమన్నారు. బీజేపీ తీరుకు ఆర్బీఐ గవర్నర్లు కూడా రాజీనామా చేసిపోయారని గుర్తుచేశారు. సీబీఐ భ్రష్టు పట్టే పరిస్థితిని బీజేపీ నేతలే తెచ్చారని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ఈసీకే తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి వ్యాఖ్యలపైనా చంద్రబాబు స్పందించారు. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసమే వివేకా కూతురు, భార్యతో ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆరోపించారు. వివేకా కూతురు వ్యాఖ్యల్లో రోజురోజుకూ వైరుధ్యాలు కనిపిస్తున్నాయన్నారు. వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే సిట్ నివేదికకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. జగన్ చేస్తున్న అరాచకాలు అన్నింటికీ మోడీ వంత పాడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

Similar News