డాటా చోరీ కేసులో మలుపులు తిరుగుతోంది. కీలక సాక్ష్యం టీడీపీ దగ్గర ఉందని చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్ష్యాలన్ని తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటారు కానీ ఎక్కడో ఏదో ఒక సాక్ష్యం వదిలేస్తారని అన్నారు. ఆ వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వివరాలు వెల్లడిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.