విజయవాడలో రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

Update: 2019-04-05 09:13 GMT

టీడీపీ నేతలపై ఐటీ దాడులకు నిరసనగా సీఎం చంద్రబాబు విజయవాడలో ఆందోళనక నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని అడిగినందుకు కేంద్రం ఎదురుదాడి చేస్తోందన్నారు. ప్రధాని మోడీ శాశ్వతంగా ఉంటారని జగన్ పొగుడుతున్నారని మండిపడ్డారు. ఓ పథకం ప్రకారం జగన్ హైదరాబాద్ నుంచి కుట్రలకు రూపకల్పన చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు జాతితో పెట్టుకుంటే పాతాళానికి పోతారని మోడీని చంద్రబాబు హెచ్చరించారు.

Similar News