జగన్ కుట్రలో భాగమే చంద్రగిరి రీపోలింగ్ : దేవినేని

Update: 2019-05-17 09:13 GMT

జగన్ కుట్రలో భాగంగానే చంద్రగిరిలో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారని మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. 34 రోజుల తర్వాత రీ పోలింగ్ కు ఎలా ఆదేశాలు ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని వైసీపీ నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు. ఈనెల 23న వెలువడనున్న ఎన్నికల ఫలితాలతో వైసీపీ దుకాణం బంద్ అవుతుందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే జగన్ తన ఆఫీసును హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించారని తెలిపారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం, కొత్త ప్రధాని వస్తారని కొత్త ప్రధానిని చంద్రబాబే నిర్ణయిస్తారని మంత్రి దేవినేని చెప్పారు.  

Similar News