దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ అలర్ట్ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా హింస తలెత్తే ప్రమాదముందన్న కేంద్ర హోంశాఖ కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. కౌంటింగ్కు ఆటంకాలు కల్పించే విధంగా హింసను ప్రేరేపించే విధంగా ప్రకటనలు చేసే అవకాశముందని, ఈ విషయంలో అన్నిరాష్ట్రాలు గట్టి భద్రతా చర్యలను చేపట్టాలని సూచన చేసింది.