ఏపీకి కేంద్రం కరవు సాయం...ఖబడ్దార్ టీడీపీ అంటూ జీవీఎల్‌ వార్నింగ్‌

Update: 2019-01-29 11:51 GMT

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం కరవు సాయం ప్రకటించింది. జాతీయ విపత్తు నిధి కింద 900కోట్ల రూపాయల అదనపు సాయాన్ని కేంద్రం రిలీజ్ చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఏపీకి అదనపు కరవు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సాయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ట్వీట్‌ చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని, టీడీపీని టార్గెట్‌ చేసిన జీవీఎల్‌ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన 900కోట్లను అవినీతిమయ టీడీపీ మింగేయకుండా సద్వినియోగం చేయాలంటూ హెచ్చరించారు. కరవు సాయం కింద కేంద్రం ఇచ్చిన నిధులను దొంగ దీక్షలు, విలాసాలకు వాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. కరవు నిధుల వినియోగంపై అన్ని జిల్లాల్లో బీజేపీ నిఘా పెడుతుందన్న జీవీఎల్‌ ఖబడ్దార్ టీడీపీ అంటూ జీవీఎల్‌ హెచ్చరించారు.



Similar News