ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటేశారు. గోరఖ్పూర్లోని పోలింగ్ బూత్ నెంబర్ 246లో తన ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నాలోని రాజ్భవన్ పరిథిలో ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటేయగా, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ పాట్నాలోని 46వ నంబరు పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాట్నా మహిళా కళాశాలలోని 77 నంబరు పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ పంజాబ్లోని జలంధర్ జిల్లా పరిథిలోని గార్హి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశాడు.