టీడీపీ ఎంపీ సుజనా చౌదరి సంస్థల్లో రెండో రోజు సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న సీజ్ చేసిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్యాలయాన్ని ఇవాళ తెరిచి తనిఖీలో చేపట్టారు. నిన్నటి సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను ఇవాళ వెరిఫికేషన్ చేస్తున్నారు. సుమారు 30 మంది అధికారులు బ్యాంకు అధికారుల సమక్షంలో పరిశీలిస్తున్నారు. మేనిజింగ్ డైరెక్టర్ సహా నలుగురు డైరెక్టర్లను విచారిస్తున్నారు. ముఖ్యంగా 120 షల్ కంపెనీలపైనే ఆరా తీస్తున్నారు. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగవేసిన కేసులో సీబీఐ అధికారులతోపాటు బ్యాంకింగ్ ఫ్రాడ్ సెల్ టీం సభ్యులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.