సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడింది. ఆయన ఎంపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. పైగా ఈ సీబీఐ మాజీ అధికారి ఓ ప్రముఖ వ్యక్తిని ఢీ కొంటున్నారు. ఇటీవలే జనసేనలో చేరిన లక్ష్మీనారాయణ ఇంతకీ ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరిపై తలపడుతున్నారు...?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసేది ఎక్కడి నుంచో తేలిపోయింది. ఇటీవలే పవన్ కల్యాణ గూటికి చేరిన లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీ బరిలో నిలబడుతున్నట్లు జనసేన ప్రకటించింది. లక్ష్మీనారాయణ తొలుత భీమిలి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చినా అనేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది.
ఇటీవలే రాజకీయాల్లో అడుగిడిన లక్ష్మీనారాయణ విశాఖలో ఓ కొత్త వ్యక్తితోనే తలపడుతున్నారు. విశాఖ ఎంపీగా టీడీపీ తరఫున టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు, దివంగత టీడీపీ నేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ రాజకీయాలకు కొత్త కావడం విశేషం. ఇక విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్థిగా ఎంవీవీ సత్యనారాయణ తలపడుతున్నారు. అయితే అందరి దృష్టి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, బాలయ్య చిన్న అల్లుడు శ్రీ భరత్ పైనే ఉంది.