యూపీ బులంద్షహర్ లోక్సభ నియోజకవర్గంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ యువకుడు బహుజన్ సమాజ్ పార్టీకి పెద్ద అభిమాని. అయితే ఈ ఎన్నికల్లో పొరపాటున ఏనుగు (బీఎస్పీకి) గుర్తుకు బదులు పొరపాటున ఈవీఎంలో కమలం పువ్వు గుర్తు వద్ద మీట నొక్కి ఓటేశాడు. అంతే ఇక తాను తమ సొంత పార్టీ గుర్తుకు ఓటువేయక వేరే పార్టీ అభ్యర్ధికి ఓటు వేయడాన్ని తట్టుకొలేక ఓ దళితుడు కోడవలిని ఉపయోగించి తన వేలిని నరికేసుకున్నాడు. అయితే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్షార్లో లోక్సభ రెండో దశ ఎన్నికల పోలింగ్లో చోటు చేసుకుంది. శిఖర్పుర ప్రాంతంలోని అబ్దుల్లాపూర్ హులాసన్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ (25) ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వేలిని నరికేసుకున్న తర్వాత పొరపాటున బీజేపీకి ఓటేశానంటూ అతను విచారం వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.