చంద్రబాబుకు భయం పట్టుకుంది: బొత్స
జగన్ పై జరిగిన దాడి కేసులో ఎన్ఐఏ విచారణపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం సిగ్గుచేటు అని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
జగన్ పై జరిగిన దాడి కేసులో ఎన్ఐఏ విచారణపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం సిగ్గుచేటు అని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబులో ఉన్న భయం, ఆందోళన అంతా లేఖలో కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. తొలుత జగన్పై దాడి జరిగినప్పుడు కోడికత్తి అంటూ హేళన చేసినవారే లేఖలో మాత్రం హత్యాయత్నం అని సంభోదించారని గుర్తు చేశారు. ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటన కాబట్టి ఎన్ఐఏ విచారణ జరపాలని చట్టంలో ఉందని బొత్స చెప్పారు.