ఖిలాడీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దిన్యార్ కాంట్రాక్టర్ (79) మృతి చెందారు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. హిందీ గుజరాతీ సినిమాలతో పాటు పలు టీవీ షోస్లోనూ ఆయన నటించారు.ఆయన చేసిన సేవలకు గానూ 2019లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.