భారతదేశంలో తొలి హిందూ టెర్రరిస్ట్ నాథూరామ్ గాడ్సే అంటూ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ చీఫ్ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. కమల్ హసన్ ప్రచారంపై ఐదు రోజులు నిషేధం విధించాలని బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ్ ఈసీని కోరారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువులపై తీవ్రవ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్పై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.