తెలంగాణలో బీజేపీని టీడీపీ ముంచేసింది: ఎమ్మెల్యే విష్ణుకుమార్

Update: 2019-02-01 06:14 GMT

తెలంగాణలో బీజేపీ ఓటమికి టీడీపీయే కారణమని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల దృష్టితోనే టీడీపీ తెలంగాణలో కాంగ్రెస్‌తో అపవిత్ర పొత్తు పెట్టుకుందన్నారు. దాని మూలంగా తమకున్న సీట్లు కూడా పోయాయన్నారు. తమ సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా పోయిందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు మునిగిపోవడమే కాదు తమను కూడా ముంచేశారన్నారు. టీడీపీకి అంత ప్రేమ ఉంటే ఏపీలో కాంగ్రెస్‌తో వెళుతున్నారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. మాట్లాడనివ్వకపోవడం వల్లే మిగిలిన పక్షాలు కూడా అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు.  

Similar News