'టీటీడీ అక్రమాలపై విచారణ జరిపించాలి'

Update: 2019-01-22 07:54 GMT

ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. టీటీడీలో అవినీతి రాజ్యమేలుతోందని దీనిపై విచారణ జరిపించాలని రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు గవర్నర్‌ను కోరారు. టీటీడీ అధికారులు, టీడీపీ నాయకులే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతికి పాల్పడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాల వల్ల భక్తులకు తిరుమల దేవస్థానం పట్ల నమ్మకం సన్నగిల్లుతుందనిదత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తిరుమలలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై తాను చర్యలు తీసుకున్నట్లు మాజీ డీజీపీ దినేష్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వెలుగు చూసిన టికెట్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Similar News