ప్రారంభమైన మాణిక్యాల రావు నిరాహార దీక్ష

Update: 2019-01-21 07:49 GMT

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో మాజీ మంత్రి , బీజేపీ ఎమ్మెల్యే పైడి కొండల మాణిక్యాలరావు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపిస్తూ ఆయన దీక్షకు దిగారు. హామీలు అమలు చేయకపోతే దీక్షకు దిగుతానంటూ గతంలోనే లేఖాస్త్రం సంధించిన ఆయన తన క్యాంపు క్యారాలయంలోనే దీక్షకు కూర్చున్నారు. దీక్షకు తాడేపల్లి గూడెంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కార్యకర్తలు, స్దానికులు భారీగా తరలివచ్చారు. రిక్షా, ఆటో, ఇతర యూనియన్ల కార్మికులు మాణిక్యాల రావు దీక్షకు మద్దతు తెలిపారు. 

Similar News