రాంపూర్‌ బరిలో జయప్రద

Update: 2019-03-26 15:01 GMT

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుసగా సినీ నటులు పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీల్లో ఉన్న కొందరు తారలు అవసరాలకు తగినట్టు జెండాలు మారుస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. యూపీ, పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేసే 29 మంది అభ్యర్థులతో తాజా జాబితాను బీజేపీ ప్రకటించింది. కాగా జయప్రదను ఊహించినట్టే యూపీలోని రాంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ బరిలో నిలిపింది. లోక్‌సభ అభ్యర్థుల పదో జాబితాలో మేనకా గాంధీ, వరుణ్ గాంధీ పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది. మురళీ మనోహర్‌ జోషీని తప్పించి కేంద్ర మంత్రి సత్యదేవ్‌ పచౌరీకి చోటు కల్పించారు. యూపీ మంత్రి రీటా బహుగుణ జోషికి అలహాబాద్‌ స్ధానం నుంచి పోటీకి నిలిపారు. 

Similar News