చంద్రబాబుకు గిఫ్ట్‌ ఇస్తా: అఖిలప్రియ

Update: 2019-03-26 15:13 GMT

ఏపీలో ఎన్నికల దగ్గరపడే కొద్ది రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇటు నాయకులు మాటల తూటలతో ప్రచారం ఘోరెత్తున్నారు. ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియ ప్రచారంలో దూసుకపొతున్నారు. ఆళ్లగడ్డలో ఓటు అడిగే హక్కు తనకే ఉందన్నారు టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ. ఆళ్లగడ్డలో ఇవాళ ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో మా అమ్మ, నాన్న ఎంత మెజార్టీతో గెలిచారో అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిచి సీఎం చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తామన్నారు. తన తల్లిదండ్రులు చనిపోయాక నియోజకవర్గంలో 2వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు రుణం తీర్చుకోలేమన్న అఖిలప్రియ టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

Similar News