వేములవాడలో బండి సంజయ్‌ ప్రత్యేక పూజలు

Update: 2019-05-24 08:24 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో విజయం సాధిచడంతో రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్రలో ఎన్డీఏకు 351 సీట్లు వచ్చినందుకు 351 కోడెలను మొక్కుగా చెల్లించుకున్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు బండి సంజయ్. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.

Similar News