అమరావతిలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో కీలక మీటింగ్కి సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి డుమ్మాకొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలకబూనిన అశోక్ గజపతిరాజు పొలిట్ బ్యూరో మీటింగ్ కు రానని ముందే చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన చంద్రబాబు విజయనగరం పర్యటనకు కూడా దూరంగా ఉన్న అశోక్ గజపతిరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి డుమ్మాకొట్టారు. పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదని అశోక్ గజపతిరాజు అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. కిశోర్ చంద్రదేవ్ వ్యవహారాన్ని అశోక్తో చర్చించకపోవడం వచ్చే ఎన్నికల్లో పోటీపై భేదాభిప్రాయాలు రావడంతోనే అలకబూనినట్లు సమాచారం అందుతోంది.