ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం వైఎస్ జగన్ అని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. వైసీపీ 130 అసెంబ్లీ స్థానాలతో పాటు 20కి పైగా ఎంపీ సీట్లలో విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మడం లేదన్న ఒవైసీ టీడీపీ ఓటమి ఖాయమన్నారు. అంతేకాదు జగన్తోనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని హైదరాబాద్ ఎంపీ చెప్పుకొచ్చారు.