ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ చౌకీదార్ కాదనీ అబద్ధాల రారాజని హైదరాబాద్ మీట్ ది ప్రెస్లో ఎద్దేవా చేశారు. మోడీ ధనవంతులకే చౌకీదార్ అనీ వ్యాపారులు, బ్యాంకు ఎగవేతదారులకే కాపలాదారుగా ఉన్నారని విమర్శించారు. మోడీ చెప్పిన అచ్చేదిన్ ఏమైందని ప్రశ్నించిన ఒవైసీ అలాంటి వ్యక్తిని గెలిపించవద్దని కోరారు.