ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కారణంగా ఏదో ఒకరోజు తాను కూడా ఇందిరా గాంధీలాగే హత్యకు గురవుతానంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరను సొంత భద్రతా సిబ్బంది హత్యచేశారని తనను కూడా అలాగే హత్య చేయించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మోతీ నగర్లో కేజ్రీవాల్పై ఓ వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పై ఇప్పటికే తొమ్మిది సార్లు దాడులు జరిగాయి. ఈ దాడుల నేపథ్యంలోనే బీజేపీపై ఢిల్లీ సీఎం సంచలన ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది.