నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓ అరుదైన రాజకీయం పరిణామం చోటుచేసుకుంది. నిజామాబాద్ లోక్సభ స్థానంలో ధర్మపురి అర్వింద్ గెలుపు ఆయనకు ఓ మంచి ఛాన్స్ దొరింకింది. ఎందుకంటే ఆయన తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)తో కలిసి పార్లమెంటులో కూర్చునే అవకాశం దక్కింది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ధర్మపురి శ్రీనివాస్ కొనసాగుతుండగా, లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు అర్వింద్ భారీ మోజారీటీతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుమార్తెపై ఎంపీగా విజయం సాధించారు. కాగా డి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, అర్వింద్ బీజేపీ సభ్యులుగా కొనసాగనున్నారు.