హోదా కోసం ఢిల్లీలో శ్రీకాకుళం వాసి ఆత్మహత్య

Update: 2019-02-11 11:25 GMT

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం కింతలికి చెందిన దవళ అర్జున్ రావు ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీ భవన్ సమీపంలోని జశ్వంత్ సింగ్ రోడ్డు ఫుట్ పాత్‌పై ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అర్జున్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతని దగ్గర నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నోట్ తెలుగులో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో అర్జున్ పేర్కొన్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు దీక్షా స్థలిలోనే సంతాపం ప్రకటించి మౌనం పాటించారు. ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ తదితర నేతలు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

Similar News