కేసీఆర్‌కు రఘువీరా సంచలన లేఖ

Update: 2019-05-01 09:03 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంచలన లేఖ రాశారు. తొలుత ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన రఘువీరా.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి మద్దతు ఇవ్వొద్దన్న ఆయన కేంద్రంలో తమతో కలిసి ముందుకు రావాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా రఘువీరా గుర్తు చేశారు. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్‌తో పాటు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కూడా మద్దతు పలకాలని రఘువీరా కోరారు.

Similar News