లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఈనెలాఖరు లోపు ఖరారు చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. అభ్యర్థులతో పాటు మేనిఫెస్టోను కూడా తుది రూపు ఇస్తున్నట్లు రఘవీరా వెల్లడించారు. రాజ్యాంగ వ్యవస్థల రక్షణ, నిత్యవసర వస్తువుల ధరల, యువత, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందు పరుస్తామని పేర్కొన్నారు. రాఫెల్ కుంభకోణం, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను ప్రచారం చేస్తామని రఘువీరా తెలిపారు.